Friday, 5 June 2015

నా అలోచనలకు రెక్కలొచ్చాయ్ : 2


నా అలోచనలకు రెక్కలొచ్చాయ్ : 1


చిట్టి చిట్కాలు :


1. గ్లాసు నీటిలో ఒక నిమ్మబద్దరసం, చెంచా తేనె కలిపి తాగుతుంటే కిడ్నీ వాపు, నొప్పి తగ్గుతాయి.
2. మారేడాకులు 3, మిరియాలు 5 కలిపి రెండుపూటలా తింటుంటే మధుమేహం తగ్గును.
3. నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి రోజూ తాగుతుంటే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి.
4. ఒక కప్పు మెంతు కషాయంలో చెంచా తేనె కలిపి తాగితే గుండెజబ్బు శాంతిస్తుంది.
5. రోజూ పది మర్రిపండ్లు రెండుపూటలా తింటూంటే షుగర్ వ్యాధి (మధుమేహం) తగ్గిపోతుంది.


మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

Monday, 1 June 2015

మధుమేహ వ్యాధి లక్షణములు :

ఎవరిలో ఈ లక్షణములు ఎక్కువగా కనిపించును : అతిగా తినటం, అధిక బరువు పెరగటం, అతిగా తీపి మరియు కొవ్వును పెంచేటటువంటి నూనె పదార్ధములు సేవించడం, శారీరక శ్రమ గానీ, దేహానికి సరైన వ్యాయామము గానీ లేకుండా ఉండటం, అతిగా నిద్రపోవడం చేసేటటువంటి వారిలో ఈ క్రింది లక్షణములు కలుగుతాయి.

అతిమూత్రము వెళ్ళుట, దప్పిక, ఆకలి అధికంగా ఉండుట,ప్రతి పనియందు నిరాసక్తి , కాళ్ళు చేతులు సంధులందు బాధ, ఏవైనా దెబ్బలు తాకినా త్వరగా మానకుండుట ఈ లక్షణాలతో పాటు ఈ వ్యాధి సోకిన వారికి నిద్రలేమి అధికముగా ఉంటుంది.

అయితే అధిక ప్రోటీన్స్, కార్భోహైడ్రేట్స్ కలిగిన పిండి పదార్ధములు అధికంగా సేవించడంవల్ల, అధిక మాంస సేవన మరియు అధికంగా మద్యం తాగుటవల్ల శరీరంలోని ఆంత్రస్రావ గ్రంధులు ఆగ్నాశయమునందు ఇన్సులిన్ అనే ద్రవము సరైన మోతాదులో స్రవించకకకపోవడం వల్ల మిగిలిన  ఆంత్రస్రావ గ్రంధులపై వీటి ప్రభావము పడి చక్కెర శాతము గణనీయంగా పెరిగి ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

                  మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

Saturday, 30 May 2015

చిట్టి చిట్కాలు

1. ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా వాడేవారికి ఎప్పటికీ ఎముకలబలం తగ్గదు.
2. రెండుపూటలా పచ్చి ఉల్లిగడ్డ మజ్జిగన్నంతో తినేవారు నిత్య ఆరోగ్యవంతులుగా రాణిస్తారు.
3. రెండుపూటలా ధనియాల కషాయం తాగుతుంటే మూత్రంలో వీర్యం పోవడం ఆగిపోతుంది.
4. పత్రబీజం ఆకులు నూరి కట్టు కడితే ముక్కలైన మాంసం మరలా అతుక్కొంటుంది.
5. కరక్కాయను సిరా(ఇంకు)తో నూరి పట్టిస్తే దీర్ఘకాల తామర మూడు రోజుల్లో మటుమాయం.
6. వాము నిప్పులపై వేసి ఆ పొగను మాటి మాటికీ పీలుస్తుంటే జలుబు పూర్తిగా తగ్గుతుంది.
7. ఆహారానికి గంట ముందు కప్పు వేడినీళ్ళు తాగుతుంటే రక్తశుద్ధి.

                                 మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

Friday, 29 May 2015

చిట్టిచిట్కాలు:

1. ఉలవపిండితో కొంచెం పసుపు కలిపి నలుగుపెడుతుంటే చర్మపొరలు ఊడవు.
2. గ్లాసు మజ్జిగలో అరచెంచా వాము కలిపి తాగుతుంటే గడ్డకట్టిన కఫం కరుగుతుంది.
3. కాఫీ డికాషన్ లో నిమ్మరసం కలిపి తాగితే మలేరియా 3 రోజుల్లో తగ్గుతుంది.
4. పోక చెక్కను కొద్దిగా బుగ్గను పెట్టి చప్పరిస్తుంటే జ్వరం తగ్గిపోతుంది.
5. రోజూ పరిమితంగా మిరియాల చారు వాడుతుంటే వంట్లో వేడి తగ్గిపోతుంది.
6. మిరియాలు, కరక్కాయ, నల్లతులసి రసంతో దంచి రాస్తుంటే బొల్లిమచ్చలు హరిస్తాయి.
7. జీలకర్ర, నిమ్మరసం కలిపి నూరి పట్టువేస్తే పార్శ్వపు నొప్పి తగ్గిపోతుంది.

                             మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

Thursday, 28 May 2015

చిట్టి చిట్కాలు: తెలుసుకుందాం

1. అల్లాన్ని గుజ్జులా నూరి ప. ట్టిస్తుంటే చేతుల్లో, కాళ్ళలో పొరలు వూడటం తగ్గిపోతుంది.
2. గోరింటాకును మెత్తగా నూరి మందంగా పట్టువేస్తుంటే అరికాళ్ళ మంటలు హరించిపోవును.
3. కాకరాకు రసం రుద్దుతుంటే అరికాళ్ళ మంటలు తగ్గిపోతాయి.
4. జీడిమామిడి చెట్టు బెరడు గంధాన్ని లేపనం చేస్తుంటే ఆనెలు కరిగిపోతాయి.
5. ఆహారంలో ఉసిరిక, నిమ్మ, పాతచింతపండు మితంగా రోజూ వాడుతుంటే జీవితాంతం ఏ రోగం రాదు.
6. మిరపకారానికి బదులు మిరియాలకారం వాడుతుంటే జీవితంలో రోగమేరాదు.
7. పరగడుపున మూడు సరస్వతి ఆకులు తినేవారికి సదా శారీరక, మానసిక బలం నిండుగా ఉంటుంది.

                    మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ