Wednesday, 3 September 2014

కోపంతో, దుఖంతో భుజిస్తే కొంపలారిపోతాయ్:

మానవ శరీరంలో గొంతువద్ద విశుద్ధ చక్రం, అక్కడే ' థైరాయిడ్ ' అని పిలవబడే గ్రంధి కూడా నిర్మాణమై ఉన్నయ్. దానికి పైన కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం, దానివద్దే ' పిట్యూటరీ గ్లాండ్ ' కూడా ఏర్పాటై ఉన్నయ్ . ఈ రెండు గ్రంధులు మెదడుతో అనుసంధానమై నాడీ సంబంధం కలిగివున్నయ్. ఎప్పుడైతే మనసులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలనబడే చెడు సంకల్పాలు పుడతాయో ఆ మరుక్షణమే ఆ దుష్ట సంకల్పాల నుండి ఉత్పన్నమయ్యే విష రసాయనాల ప్రభావం పిట్యూటరీ మరియు థైరాయిడ్ గ్రంధులపైన పడి వాటి  సహజ శక్తిని నశింపజేసి ఆ గ్రంధులను బలహీనపరుస్తుంది.
ఫ్యాన్ రెగులేటర్ సాయంతో ఎక్కువ తక్కువలుగా అవసరమయ్యే విధంగా ఎలా పని చేస్తుందో అదేవిధంగా మానవశరీరంలో జీవాణువుల రసాయనిక మార్పులకు, శారీరక ఎదుగుదలకు ఈ థైరాయిడ్ గ్రంధి రెగ్యులేటర్ అనబడే ఒక క్రమబద్ధ యంత్రంలాగా పని చేస్తుంటుంది.
థైరాయిడ్ గ్రంధిలో ఉత్పన్నమయ్యే జీవ రసాల ప్రభావంతోనే జీర్ణ వ్యవస్థ, మూత్ర పిండాలు, మెదడువంటి అనేక అవయవాలు,ఇతర గ్రంధులు సక్రమంగా పని చేస్తుంటయ్. ఎప్పుడైతే కామం, క్రోధంవంటి మనో మాలిన్యాల విషప్రభావం థైరాయిడ్ గ్రంధి పై పడుతుందో మరుక్షణమే దానికనుసంధానమై ఉండే ఇతర అవయవాలపైన మిగతా గ్రంధుల పైన కూడా ఆ ప్రభావం పడి మనో వ్యాధులు, అతిస్థౌల్యం, గర్భాశయరోగాలు, మూత్రపిండరోగాల వంటి అనేక వ్యాధులు క్రమ క్రమంగా పుట్టుకొస్తుంటయ్.
కాబట్టి భోజనసమయంలో కోప తాపాలకుగురై పైన తెలిపినట్లు అన్ని రోగాలకు మూలమైన అజీర్ణాన్ని సృష్టించుకొని వ్యాధిగ్రస్థులుగా బ్రతకకూడదని మహర్షులు హితవుపలికారు. ఏ కారణం వల్లనైనా భోజన సమయానికి మనసు ఆవేశంతోనో, ఆందోళనతోనో ఉంటే భుజించటం ఆపివేసి మనసు ప్రశాంతమైన తరవాతే భుజించండి.

                                 మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

ముఖముపై ఉన్న నల్లమంగు, ఎర్ర మంగు మచ్చలకు :

మనో మాలిన్యాలు లేనివాళ్ళకు, శారీరక మాలిన్యాలు లేనివాళ్ళకు ముఖములో మచ్చలు రావు. వామ్ము 100 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, ఉప్పు 25 గ్రాములు అన్ని పొడిచేసి, ఈ పొడిని రోజూ అరస్పూను తింటుంటే జీర్ణశక్తి బాగుపడి, రక్త శుద్ధి జరిగి ముఖ సౌందర్యం బాగుంటుంది.

లివర్ సమస్యలకు చింత పూవు :

లివర్ కు సంబంధించిన ఏ వ్యాధికైనా చింతపూవు దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. చింతపూవు రసంగానీ, చింతపూవుతో కాచిన కషాయంగానీ సేవిస్తూవుంటే, లివర్ వ్యాధులన్నీ హరించిపోతయ్. లివర్ క్యాణ్సర్ కు కూడా సంజీవనిలా పనిచేస్తుంది.

గవద బిళ్ళలకు :

ఉడికించిన ఆలుగడ్డ ముక్కను పైన కడితే గవదబిళ్ళలు కరిగిపోతయ్.

Tuesday, 26 August 2014

గుండెరోగాలకు శొంఠికషాయం:

శొంఠి కషాయం రెండుపూటలా పావు కప్పు తాగుతుంటే గుండెరోగాలు హరిస్తయ్.

కడుపులో మంట, వికారాలకు :

కొత్తిమీర పచ్చి ఆకులను 5-10 గ్రాములు రోజూ తింటుంటే జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యం బాగుపడుతుంది. దీనిని కషాయంగా గాని, పచ్చిదిగాని నిత్యం వాడుతుంటే సామాన్య రుగ్మతలు ఉదరవ్యాధులు హరించిపోతయ్.

                                             మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

చంటి బిడ్డల - వణుకు రోగానికి :

ఏదైనా జబ్బు చేసినప్పుడు గానీ కారణం తెలియకుండా కూడా ఒక్కోసారి చిన్నబిడ్డల కండరాలు వణకటం లేక ముడుచుకోవడం జరిగినప్పుడు వెంటనే ఉల్లిపాయను ముక్కగా కోసి ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించాలి. అలా చేస్తే త్వరగా మామూలు స్థితికి వస్తారు. ఈ విషయం చాలమందికి అనుభవంలో తెలిసిన విషయమే. ఉల్లిపాయను కోసిన వైపున బాగా వాసన ఘాటుగా వస్తుంది. కాబట్టి ఆ వాసన చూపిస్తే ఫలితం ఉంటుంది.

                                           మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ